జహీరాబాద్ సిట్టింగ్ భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ బిబి పాటిల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖని పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రావు కు పంపారు.
వెంటనే ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయంలో తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
బీబీ పాటిల్ వెంట రాజ్యసభ సభ్యులు డా” కే.లక్ష్మణ్ మరియు రాష్ట్ర నాయకులు ఉన్నారు.
నిన్న నాగర్ కర్నూలు BRS ఎంపీ రాములు కూడా BRS ను వీడి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.