తెలంగాణ బీజేపీ ఎన్నికల బరిలో నిలిచే ఎంపీ అభ్యర్థుల జాబితా ఇలా ఉండవచ్చు.
సిట్టింగ్ ఎంపీలకు మళ్ళీ అవకాశం ఇవ్వనున్నారు.
ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని మారుస్తారు అనే అవకాశం ఉందని వినిపించినా కూడా చివరకు సోయం బాపురావుకే అవకాశం దక్కింది. మిగితా కొన్ని స్థానాలకు దాదాపు అభ్యర్థులు ఖరారు అయినట్టు తెలుస్తోంది.
పాలమూరు డీకే అరుణ, చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి, భువనిగిరి బుర్ర నర్సయ్య గౌడ్, మల్కాజిగిరి ఈటెల రాజేందర్, మెదక్ రఘునందన్ రావు, హైదరాబాద్ విరంచి హాస్పిటల్ అధినేత కొంపెల్లి మాధవి లత ఉన్నారు.
ఇకపోతే కొన్ని చోట్ల BRS పార్టీ నుంచి సిట్టింగ్ అభ్యర్థులు బీజేపిలో చేరే అవకాశం ఉంది.
నాగర్ కర్నూల్ రాములు లేదా భరత్, జహీరాబాద్ బిబి పాటిల్, ఓరుగల్లు అరూరి రమేష్
పెద్దపల్లి ఓ మాజీ మంత్రి లేదా రసమయి బాలకిషన్ బీజేపీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.