![](https://i0.wp.com/indianpulsetoday.com/wp-content/uploads/2024/02/images-21.jpeg?resize=640%2C359&ssl=1)
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ ‘స్కామ్’లో విచారణ నిమిత్తం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 4న దర్యాప్తు సంస్థ ముందు హాజరుకావాలని ముఖ్యమంత్రిని కోరింది. ఎక్సైజ్ పాలసీ “స్కామ్”తో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసుకు సంబంధించి కేజ్రీవాల్కు ఈడీ సమన్లు పంపడం ఇది ఎనిమిది సారి.
ఈడీ మరోసారి సమన్లు జారీ చేయడంపై స్పందించిన ఆప్ పార్టీ నేత దిలీప్ పాండే మాట్లాడుతూ.. ఈ వ్యవహారం ఇప్పటికే కోర్టులో ఉంది. కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూడకుండా పదే పదే దర్యాప్తు సంస్థను అడ్డుపెట్టుకొని బీజేపీ ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. మేము I.N.D.A కూటమి నుంచి బయటకు వెళ్లాలని లేదా కేజ్రీవాల్ గారిని జైలుకు పంపాలని బీజేపీ కుట్ర చేస్తుంది. కానీ అవేవి జరగవు అని దిలిప్ పాండే అన్నారు.